మీకోసం న్యూస్ | కదిరి| ఆగస్ట్ 14:
మూడేళ్ల చిన్నారి ఏకంగా 79 కిలోమీటర్ల దూరం నాన్స్టాప్గా స్కేటింగ్ చేస్తూ ప్రపంచ రికార్డు లక్ష్యంగా సాగిన సాహసయాత్ర అందరినీ ఆకట్టుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన చిన్నారి అనంత దక్షిత్ మదనపల్లె నుంచి కదిరి వరకు స్కేటింగ్ చేస్తూ కదిరి పట్టణానికి చేరుకున్నారు.
ప్రపంచ రికార్డు సాధించాలనే లక్ష్యంతో చిన్నారి దక్షిత్ చేపట్టిన ఈ సాహసయాత్రకు మార్గమధ్యంలో పలువురు అభినందనలు తెలిపారు. కేవలం మూడేళ్ల వయసులోనే ఇంతటి సుదీర్ఘ దూరాన్ని స్కేటింగ్ చేయడం విశేషంగా నిలిచింది.
కదిరిలో ఘన స్వాగతం
చిన్నారి దక్షిత్ కదిరి పట్టణానికి చేరుకున్న సందర్భంగా నానా దర్గా వద్ద సాయంత్రం 6 గంటలకు ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారి దక్షిత్ను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడేళ్ల వయసులోనే దక్షిత్ ఇంతటి సాహసానికి పూనుకోవడం అభినందనీయమన్నారు. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తి పెంచుకుని ప్రపంచ రికార్డు లక్ష్యంగా ముందుకు సాగుతున్న దక్షిత్ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
చిన్నారికి ప్రజల అభినందనలు
దక్షిత్కు మద్దతుగా కదిరి పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. చిన్నారి సాహసాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన పలువురు అభినందనలు తెలిపారు.
కేవలం మూడేళ్ల వయసులోనే 79 కిలోమీటర్ల నాన్స్టాప్ స్కేటింగ్ చేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పట్టుదల, సాధన ఉంటే చిన్న వయసులోనూ అసాధారణ ప్రతిభను చాటవచ్చని దక్షిత్ నిరూపించాడని పేర్కొన్నారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా సాగుతున్న అనంత దక్షిత్ సాహసయాత్ర ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దక్షిత్ తన లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డు సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
0 కామెంట్లు