డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
గోరంట్ల మీకోసం న్యూస్ ఆగస్టు 08 : డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్లలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా శ్రమిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదని నాయకులు పేర్కొన్నారు.
‘యువత భవిష్యత్తుతో చెలగాటం’
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం నిరాశకు గురిచేయకూడదన్నారు. నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డీఎస్సీ వ్యవహారంపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ప్రతి డీఎస్సీ అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్క
0 కామెంట్లు