అమరావతి, జూలై 4 (
మీకోసం న్యూస్):
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన విప్లవ వీరుడు, మన్యం పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు ఎదిరించి రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసాలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశిష్ట స్థానం సంపాదించాయి. ఆయన త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని పలువురు నాయకులు కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను భావితరాలకు తెలియజేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.
0 కామెంట్లు