సోమందేపల్లిలో ప్రైవేట్ పాఠశాల సీజ్

 

సోమందేపల్లి, జూలై 2(మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు.

అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడం, అవసరమైన అనుమతులు లేకపోవడం వంటి లోపాలు గుర్తించినట్లు సమాచారం. దీంతో సంబంధిత పాఠశాలను వెంటనే సీజ్ చేసి, తదుపరి విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోనే తమ పిల్లలను చేర్పించాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు