దందేపల్లిలో గురుపౌర్ణమి, ఆరాధనోత్సవాలకు సర్వం సిద్ధం

 



రొద్దం, జూలై 7 (మీకోసం న్యూస్): రొద్దం మండలం దందేపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అవధూత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆశ్రమంలో నిర్వహించనున్న గురుపౌర్ణమి మహోత్సవాలు, 20వ ఆరాధనోత్సవానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ నెల 11న గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, గురుపూజ, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, మహామంగళహారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూలై 29న 20వ ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గురుపూజ, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని వారు కోరారు.
వివరాలకు: 96429 70707, 96429 71717

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు