ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానంలో, తన మధుర గానంతో ఎన్నో తరాలను అలరించారని సీఎం కొనియాడారు. భారతీయ సంగీత రంగానికి ఎస్. జానకి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె గాత్రం చిరకాలం సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని తెలిపారు.
జానకి కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులకు, సంగీత ప్రపంచానికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు.
-మీకోసం న్యూస్
0 కామెంట్లు