బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ధనుంజయ నియామకం

 


శ్రీ సత్యసాయి జిల్లా జూలై 06 (మీకోసం న్యూస్ ): భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా కమిటీలో యం. ధనుంజయను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ కు ధనుంజయ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తనకు అండగా నిలిచి ప్రోత్సహించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంత కుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, ఎస్సీ సమాజ అభ్యున్నతి, సంక్షేమం మరియు పార్టీ బలోపేతానికి అంకితభావంతో సేవలందిస్తానని ధనుంజయ పేర్కొన్నారు. ఈ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీ ఆశయాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు