రూ.5 వేల ఆర్థిక సాయం.. ఫోన్లో పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు
పెనుకొండ, జూలై 17 (మీకోసం న్యూస్): ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండడమే ప్రజాప్రతినిధుల అసలు బాధ్యత అనే భావనతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ శాసనసభ్యురాలు యస్ సవితమ్మ మరోసారి తన మానవీయతను చాటుకున్నారు. పెనుకొండ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటలక్ష్మమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి సవితమ్మ వెంటనే స్పందించారు.
వైద్య ఖర్చుల భారం కుటుంబానికి ఇబ్బందిగా మారిందని తెలుసుకున్న నేపథ్యంలో, మంత్రి సవితమ్మ ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధితురాలికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కోసం రూ.5,000 నగదు సహాయాన్ని అందజేశారు. ఆర్థిక సాయం అందజేస్తూ, ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అదే సమయంలో మంత్రి సవితమ్మ స్వయంగా ఫోన్ ద్వారా వెంకటలక్ష్మమ్మతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకుని, అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని సూచిస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి సవితమ్మ ప్రజల పట్ల చూపుతున్న ఆప్యాయత, కార్యకర్తల సంక్షేమంపై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ సంఘటన మరో నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యుడేననే భావనతో ఆమె వ్యవహరిస్తుండటం అభినందనీయమని పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా కన్వీనర్ రమణమ్మ, కొండంపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొని వెంకటలక్ష్మమ్మను పరామర్శించారు. త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
సహాయం అందుకున్న వెంకటలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు మంత్రి సవితమ్మతో పాటు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ద్వారా మంత్రి సవితమ్మ సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు.
0 కామెంట్లు