సోమందేపల్లికి ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు రైల్వే గేట్ మరమ్మతుల నేపథ్యంలో మార్గం మళ్లింపు.. బస్టాప్‌లో ఆపడం లేదని ఆవేదన


 సోమందేపల్లి, జూలై 14 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపో నుంచి ధర్మవరం, పుట్టపర్తి, అనంతపురం వైపు వెళ్లే బస్సులను చాకర్లపల్లి రైల్వే గేట్ మరమ్మతుల కారణంగా పాలసముద్రం మార్గం మీదుగా నడుపుతున్నారు. అయితే ఈ మార్పు కారణంగా సోమందేపల్లి బస్టాండ్‌తో పాటు జాతీయ రహదారిపై ఉన్న సోమందేపల్లి హైవే స్టాప్‌లో కూడా బస్సులు ఆపడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సోమందేపల్లి నుంచి ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. బస్సులు ఆగకపోవడంతో ప్రత్యామ్నాయ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సోమందేపల్లిలో కనీసం హైవే స్టాప్ వద్దైనా బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు