ఆరోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ చెక్కులు

రూ.83.34 లక్షల ఆర్థిక సాయం పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ

శింగనమల, జూలై 19 (మీకోసం న్యూస్): ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.83,34,683 విలువైన చెక్కులను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు అనారోగ్య చికిత్స కోసం అప్పుల పాలవకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ పథకం ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు అండ లభిస్తోందని పేర్కొన్నారు.

చెక్కులు స్వీకరించేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారులకు భోజన వసతి ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే స్వయంగా వడ్డించి ఆతిథ్యం అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు