రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ బలం కరికేరలో ఇంటింటికీ 'రచ్చబండ' కార్యక్రమం

గుడిబండ, జూలై 28 (మీకోసం న్యూస్): తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా గుడిబండ మండలం కరికేర గ్రామపంచాయతీలో మంగళవారం డోర్ టు డోర్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో డా. డి. శ్రీనివాసమూర్తి, కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, రవిశంకర్, భోజరాజు, నాగరాజు, చంద్రశేఖర్, డా. కృష్ణమూర్తి, శ్రీనివాసులు, రమేష్, నారాయణప్ప, గోవర్ధన్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరు, గ్రామాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు