సోమందేపల్లి మద్యం దుకాణంలో తనిఖీలు నిబంధనల అమలుపై ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక దృష్టి స్టాక్, విక్రయాల రికార్డులు పరిశీలన.. అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు


 సోమందేపల్లి, జూలై 13 (మీకోసం న్యూస్):

సోమందేపల్లి మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని మద్యం నిల్వలు, విక్రయాల రికార్డులు, బిల్లులు, ధరల జాబితా, స్టాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 

అధిక ధరలకు విక్రయాలు, బిల్లులు ఇవ్వకపోవడం, అనుమతులకు విరుద్ధంగా మద్యం విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే మద్యం విక్రయించాలని, వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలని దుకాణ సిబ్బందికి సూచించారు. 

ప్రభుత్వ నిబంధనల అమలు, పారదర్శకమైన విక్రయాల కోసం ఇటువంటి తనిఖీలు జిల్లావ్యాప్తంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. 

-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు