19న ఈడిగ–గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు ఆహ్వానం

హిందూపురం, జూలై 15 (మీకోసం న్యూస్): ఆర్య ఈడిగ–గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హిందూపురంలోని ఈడిగ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 19న పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 2026 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని కోరుతూ సంఘం ప్రతినిధులు బుధవారం కర్నూలులో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్లను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్, రొద్దం మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, గిరిధర్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, సదాశివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంఘం నాయకులు ఏర్పాట్లు చేపట్టారు.
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు